Snake Bite | టీటీడీ ఈవో బంగ్లాలో మాజీ ఉద్యోగిని కాటేసిన నాగుపాము

తిరుపతిలో టీటీడీ ఈవో జే శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం రేపింది. గురువారం రాత్రి ఓ భారీ నాగుపాము లోపలికి దూరింది.. వెంటనే అప్రమత్తమైన బంగ్లా సిబ్బంది వెంటనే పామును పట్టేందుకు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే టీటీడీ ఈవో బంగ్లాకు వచ్చారు..

చాకచక్యంగా పామును పట్టుకుని గోనె సంచెలో వేస్తుండగా.. ఆ పాము రవీందర్ నాయుడు చేతిపై కాటు వేసింది. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది ఆయన్ను తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం రవీందర్ నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. గతంలో కూడా టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి భాస్కర్ నాయుడు పామును పట్టుకునే ప్రయత్నం చేయగా కాటు వేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారగా.. ప్రభుత్వం, టీటీడీ సూచనతో మెరుగైన వైద్యం అందించడంతో కోలుకున్నారు.

అయితే ఈ ఘటన తర్వాత భాస్కర్ నాయుడు మళ్లీ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మరో రిటైర్డ్ ఉద్యోగి రవీంద్ర నాయుడిని నాగుపాము కాటు వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *