మోతె, (ఆంధ్రప్రభ) : మోతె మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసినందుకు ఇద్దరు గిర్దవార్ లను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మోతె మండల గిర్దవార్ గా విధులు నిర్వహిస్తున్న జే.నిర్మలదేవి, అదనపు గిర్థవార్ షేక్ మన్సుర్ అలీలు పాత పహాణి రికార్డులలో పేర్లు లేకపోయినా పేర్లు ఉన్నట్లు సృష్టించి ధరణి లో మిస్సింగ్ సర్వే నెంబర్లు కింద 11 దరఖాస్తులు చేపించి భూమి ఉన్నట్టు తప్పుడు ధ్రువీకరణ చేసి పంపించటం జరిగిందని అన్నారు.
మంగళవారం నాడు ఇట్టి విషయమై కలెక్టర్ మోతె తహసీల్దార్ కార్యాలయానికి వేళ్ళి రికార్డులు పరిశీలించి ట్యాంపరింగ్ చేయటం జరిగిందని నిర్దారించడమైనది. పలు రికార్డులను ట్యాంపరింగ్ చేసి ఉన్నత అధికారులను తప్పుదోవ పట్టించిన మోతె మండల గిర్థవార్లు జే నిర్మలదేవి, అదనపు గిర్థవార్ షేక్ మన్సుర్ అలీ లను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
మోతె మండల కేంద్రంలోని ఏ.యం గౌడ్ మీసేవ కేంద్రంను సంబంధిత అధికారులు సీజ్ చేశారు. మీ సేవ నిర్వాహకుడు అండెం మల్లేష్ ను మోతె స్థానిక ఎస్ఐ యాదవేందర్ రెడ్డి విచారణలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు.