AP | అరగంటలో లోడ్ మాయం..
AP | అరగంటలో లోడ్ మాయం..
చిత్తూరు జిల్లాలో సంచలనం
AP | చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు డిపో నుండి కార్వేటినగరం వైపు మద్యం లోడ్తో వెళ్తుండగా, బసిరెడ్డిపల్లి సమీపంలో లారీ టైర్ ఒక్కసారిగా పగిలిపోవడంతో (పంక్చర్ అవ్వడంతో) వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.

చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద సుమారు పది లక్షల రూపాయల విలువైన మద్యం లోడ్తో వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ అయి బోల్తా పడింది ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. లారీ బోల్తా పడిన నిమిషాల్లోనే స్థానికులు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లడంతో సరుకంతా ఖాళీ అయింది.


