వెలగపూడి | ఏపీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన డిప్యూటీ కలెక్టర్ విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్ను ఎమ్మార్వోగా డిమోషన్ చేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. డిప్యూటీ కలెక్టర్ పిటిషన్పై విచారణ సందర్బంగా సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాము చట్టానికి అతీతులమన్న భావనను ప్రభుత్వ అధికారులు తగ్గించుకోవాలని వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు అమరావతి, విజయవాడ , తీహార్.. ఏ జైలుకు వెళ్లాలో డిప్యూటీ కలెక్టరే నిర్ణయించుకోవాలని సూచించింది. ఉద్దేశపూర్వకంగా ఉత్తర్వులను పాటించకపోవడంతో డిప్యూటీ కలెక్టర్కు ఏపీ హైకోర్టు రెండు నెలల జైలుశిక్ష విధించింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేశారు డిప్యూటీ కలెక్టర్. ఈ పిటేషన్పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
2013 డిసెంబర్ 11న గుంటూరులో ఒక ప్రాంతంలో ఆక్రమణలను తొలగించవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను డిప్యూటీ కలెక్టర్ ధిక్కరించారు. అప్పట్లో తహసీల్దార్గా ఉన్న ఆ అధికారి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి 2014లో ఆక్రమణలు తొలగించారు. దీంతో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన ఆ తహసీల్దార్కు ఏపీ హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ డిప్యూటీ కలెక్టర్ సుప్రీంను ఆశ్రయించిగా… గత సోమవారం విచారణ జరిపింది ధర్మాసనం. విచారణలో డిప్యూటీ కలెక్టర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జస్టిస్ బీఆర్ గవాయ్.