Rajasthan | నదిలో మునిగి ఎనిమిది మంది మ‌ర‌ణం

రాజస్థాన్ : స్నానానికి వెళ్లి నదిలో 8మంది యువకులు మునిగిపోయారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌లోని టోంక్ (Tonk) జిల్లాలోని బనాస్ నది (Banas river) లో చోటు చేసుకుంది. 11మంది యువకులు నదిలో స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండటం కారణంగా.. ఎనిమిది మంది నీటిలో కొట్టుకొనిపోయారు. వారిలో 8 మంది మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.

జైపూర్ (Jaipur) కు చెందిన 11మంది యువకులు టోంక్ జిల్లాలోని బనాస్ నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. నదిలో ఒక్కసారిగా ఉప్పెన రావడంతో లోతైన ప్రాంతంలోకి వెళ్లడం వల్ల వారు మునిగిపోయారు. స్థానికులు, పోలీసులు (police) వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు. వారిలోని 8మందిని యువకులను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *