Budget 2025 | ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకం
- వ్యాపారం చేసుకునే వారికి రూ.2 కోట్ల వరకు రుణం
- మొత్తం 5లక్షల మంది షెడ్యూల్ కులాల మహిళలకు ప్రయోజనం
న్యూ ఢిల్లీ : ఈ బడ్జెట్లో షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ.2కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా మొత్తం 5లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. తొలిసారి సొంత వ్యాపారాలను ప్రారంభించే, ఉన్న వ్యాపారాలను విస్తరించాలనుకునే మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. అలాగే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.