BRS Party – తెలంగాణ‌కు ద‌శ‌, దిశ‌..గులాబీ జెండానే : కేటీఆర్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ :తెలంగాణ‌కు ద‌శ‌, దిశ గులాబీ జెండానే అని, బీఆర్ఎస్ ఓట‌మితో తెలంగాణ స‌మాజం ఎంతో న‌ష్ట‌పోయింద‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేతలు చేరక‌ల‌ సంద‌ర్భంగా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం, తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసుకోవడం తెలంగాణ స‌మాజానికి చారిత్రక అవసరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలకు కొంత మంది టెంప్ట్ అయి అవకాశమిస్తే మనం తినే గిన్నెలో మట్టిపోసుకున్నట్లు అయిందన్నారు.అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, మంచి చేస్తే ఎవరైనా అభినందిస్తార‌న్నారు.

కేసీఆర్ ఆన‌వాళ్లు తొల‌గిస్తామ‌న‌డం అనాగ‌రికం

బీఆర్ఎస్ అధినేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత కేసీఆర్ ఆన‌వాళ్లు తొల‌గిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన‌డం అనాగ‌రిక చ‌ర్య అని, గతంలో వైఎస్సార్, చంద్రబాబు మంచి పనులు చేశార‌ని, వారిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంద‌ని కేటీఆర్ అన్నారు. గతంలో వారు చేసిన మంచి పనులుంటే కేసీఆర్ కొనసాగించారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటున్నారని మండిపడ్డారు. కానీ ఆనావాళ్లు తొలగిస్తామని అనడం అనాగరిక చర్య అన్నారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 500 రోజులు అయినా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. ఓఆర్ఆర్ లోప‌ల.. ఆ రెండు పార్టీల‌ను న‌మ్మ‌లేదుకాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రజలు వారి మాటలను నమ్మలేదని కేటీఆర్ అన్నారు.

అసెంబ్లీ ఎన్నిక్లలో ఓఆర్ఆర్‌లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదని గోషామహల్‌లో మన అభ్యర్థి ఆగమాగం చేయడంతోనే అక్కడ బీజేపీ గెలిచిందన్నారు. తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ శత్రువులేనన్నారు. గులాబీ జెండానే తెలంగాణకు గుండె ధైర్యం అన్నారు. చేవెళ్ల, రాజేంద్రనగర్‌లో తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయని అక్కడ కాంగ్రెస్‌కు దిమ్మతిరేగేలా పార్టీ గెలవాలన్నారు.

పదకొండేళ్లుగా హిందూ, ముస్లిలను మతం పేరుతో విభజించడం తప్ప ప్ర‌ధాని మోదీ చేసిందేమి లేదన్నారు. తెలంగాణ‌కు మోదీ చేసిందేమిటి?మోదీ ప్ర‌భుత్వం తెలంగాణ స‌మాజానికి చేసిందేమిటి అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. మోదీ వచ్చాక తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. మోదీ, రేవంత్ నెగిటివ్ పాలిటిక్స్ తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.

కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు రాహుల్, సోనియా గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసులు పెడితే ఇప్పటి వ‌ర‌కు రేవంత్ రెడ్డి మాట్లాడలేదని, ఇది రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒకరినొకరు కాపాడుకునేందుకు సంకేతమా అని ప్రశ్నించారు. కేసీఆర్ హ‌యాంలో దాదాగిరీ లేదు..కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఒక్క ప్లాట్, వెంచర్, బిల్డింగ్ వద్దకు వెళ్లి దాదాగిరీ చేసే దమ్మున్నోడు లేడ‌ని, కానీ కాంగ్రెస్ హాయంలో ఎవరికివారే దోచుకున్నంత దోచుకుంటున్నారని కేటీఆర్‌ ఆరోపించారు.

ఈ ప్రభుత్వానికి అన్ని నెగిటివ్ పనులే తప్ప పాజిటివ్ పనులు లేవన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీకి మాత్రం లక్షన్నర కోట్లా అని ప్రశ్నించారు. మూసీతో మురిసే రైతులు ఎంతమంది? దాంతో వచ్చే ఆయకట్టు ఎంతా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన వద్దనడం లేద‌ని, సంక్షేమ పథకాలు నిధులు లేకుండా మూసీకి సోకులు ఎందుకు అని ప్రశ్నించారు.

ఇందిరమ్మ ఇండ్లకు రెండు బడ్జెట్ లలో నిధులు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఒక్క ఇటుక పెట్టలేదన్నారు. దేశ జనాభాలో మూడు శాతం కంటే తక్కువ ఉన్న తెలంగాణ రాష్ట్రం కేంద్రం ఇచ్చే 30ఉత్తమ పంచాయతీ అవార్డులు గెలుచుకుందన్నారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటిని సమానంగా తీసుకువెళ్లారని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *