AP| “బూతుల” కంటే “పోలింగ్ బూత్” లు గొప్ప‌వి – మాజీ రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు

అందుకు బూతుల మాట్లాడిన నేత‌లంద‌రూ ఓడారు
అసెంబ్లీలో కొట్టుకోవ‌డం, బ‌ట్ట‌లు చించుకోవ‌డం కామ‌న్
అమ్మ‌ను, భార్య‌ను సైతం భూతులు తిడుతున్న పైతం పెరిగింది
ఎమ్మెల్యేలు మంచి భాష‌ను, న‌డ‌వ‌డిక‌ను అల‌వ‌ర్చుకోవాలి
ఉచిత ప‌థ‌కాల వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌
జ‌మిలీ ఎన్నిక‌ల వ‌ల్ల అంద‌రికీ మంచే జ‌రుగుతుంది
ఒక దేశం – ఒక ఎన్నిక స‌దస్సులో మాజీ రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు

తిరుప‌తి – గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు అంటూ సెటైర్లు వేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఒక దేశం – ఒక ఎన్నికపై తిరుపతిలో నేడు జ‌రిగిన మేధావుల సదస్సులో ప్రసంగిస్తూ వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు ఒక కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై చర్చల కంటే నేతల భూతులు ఎక్కువయ్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. . అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకుని పరిస్థితికి తెచ్చారని అన్నారు. ఇంట్లో ఉండే అమ్మను, భార్యను తమ నేతలతో భూతులు తిట్టించి కోందరు రాక్షస ఆనందం పొందారన్న ఆయన.. నువ్వే నా.. మేం అంతే అంటూ మరికొద్దిమంది భూతులు మాట్లాడుతున్నార‌ని వాపోయారు. . గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయార‌న్నారు. .. వారు ఎవరో మీకే తెలుస‌ని అంటూ ప్రజల అందరూ ఆ నేతల భూతులు వినలేక‌.. పోలింగ్ భూత్‌లోకి వెళ్లి ఓటు వేసి ఓడించార‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో . భూతులు కంటే పోలింగ్ భూత్ గొప్పది.. బలమైనది అని పేర్కొన్నారు వెంక‌య్య నాయుడు..
ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాల‌ని.. భాషను జాగ్రత్తగా వాడాలి అని సూచించారు .. ఇక, ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమ‌న్నారు. … చదువు, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాల‌ని అంటూ ఇత‌ర ఉచితపథకాల వల్ల నష్టం తప్ప లాభం ఉండదు అన్నారు..

జ‌మిలీ ఎన్నిక‌ల‌తో మేలు…

మరోవైపు, ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల సమయం ఆదా, ఖర్చు ఆదా అవుతుందన్నారు.. ఎన్నికల ఖర్చు వేలకోట్లుకు చేరింద‌న్నారు. .. తాను ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో ప్రజలు విరాళంగా కొంత డబ్బులు ఇచ్చార‌ని, తాను ఒక్క రూపాయల జేబులో నుండి తీయలేద‌ని, అలాగే ఒక్క రూపాయి జేబులో వేసుకోలేదని గుర్తుచేసుకున్నారు.. రాజకీయాల్లో కులం, ధనం, మతం లేకుండా చేయాల‌న్నారు. . కానీ, కులం, డబ్బులు, క్రిమినల్స్ కి ఇప్పుడున్న పార్టీలు ప్రధాన్యత ఇస్తున్నాయన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి. జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. . జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని అన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేక పోతున్నాయని చెప్పారు. పార్టీ ఫిరాయించడం ప్రజాస్వామ్యానికి చేటు అని అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ కావడం సరికాదని వ్యాఖ్యానించారు.

https://twitter.com/MVenkaiahNaidu/status/1910952630005997571

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *