27-Places-India : అవన్నీ భారత్ వే Andhra Prabha Top Story
27-Places-India : అవన్నీ భారత్ వే Andhra Prabha Top Story
- జాంగ్నాన్ కానే కాదు
- సర్వే ఆఫ్ ఇండియా స్నఫ్టం
- అరుణాచల్ ప్రదేశ్లో.
- 27 ప్రాంతాలకు మేప్ లో చోటు
- చైనా కబ్జాకు ఝలక్
(ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ )

భారత ఈశాన్య భూభాగం కబ్జా కోసం 67 ఏళ్లుగా తపిస్తున్న డ్రాగన్ కు తాజాగా.. భారత్ చుక్కలు చూపించింది. ఈశాన్యంలోని అరుణాచల్ ప్రదేశ్లోని కీలక ప్రాంతం తమదేనని. జాంగ్నాన్ అనే పేరుతో.. పదే పదే అనధికారికంగా.. ప్రయారం చేసుకుంటున్న చైనాకు సర్వే ఆఫ్ ఇండియా ఝలక్ ఇచ్చింది. అరుణచల్ ప్రదేశ్లోని 27 కీలక ప్రాంతాలన్నీ భారత భూభాగమేనని భారత్ మేప్ లో విశదీకరించింది. బారత దేశ ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాల పేర్లను మార్చడానికి చైనా పదేపదే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో , 27 ప్రాంతాల , భౌగోళిక స్వరూపాలను భారతీయ పేర్లతో అధికారిక సర్వే ఆఫ్ ఇండియా మేప్ లాంఛనంగా గుర్తించింది.ఈ ప్రాంతాలను కచ్చితంగా గుర్తించడం, వాటి భౌగోళిక వ్యూహాత్మక ప్రాముఖ్యతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం ఈ చర్య ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
27-Places-India : జాంగ్నాన్ కానే కాదు
బీజింగ్ ‘జాంగ్నాన్’ అని పిలిచే అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలను చైనా ఎప్పటికప్పుడు “ప్రామాణికమైనవి” అని చెబుతున్న పేర్ల జాబితాలను చైనా జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ తాజా చర్య తీసుకున్నారు.
ఈ పేరు మార్పు చర్యలను “వ్యర్థమైనవి అసంబద్ధమైనవి” అని న్యూఢిల్లీ నిరంతరం తిరస్కరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో “గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా” అంతర్భాగంగా ఉంటుందనే వాస్తవాన్ని ఇటువంటి చర్యలు మార్చలేవని స్పష్టం చేసింది.
27-Places-India : అవన్నీ భారత్ వే,,
భారత పటంలో అధికారికంగా గుర్తించిన 27 ప్రాంతాల్లో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి లాంగ్ జూ కీలకం . 1959లో ఈ ప్రాంతంలో చైనా బలగాలు ప్రవేశించాయి. భారత్-చైనా మధ్య తొలి ఉద్రిక్త ప్రాంతగా మారింది. అప్పర్ సుబన్సిరి జిల్లాలోని లాంగ్ జూ సమీపంలోని మాజా గ్రామాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు.
జో లా, రిజా లా మరియు పుకుర్ లా సహా వ్యూహాత్మకంగా ముఖ్యమైన అనేక ఎత్తైన కనుమలను అధికారికంగా గుర్తించారు. 1962 భారత్-చైనా యుద్ధంతో ముడిపడి ఉన్న కీలక ప్రాంతాల్లోని థాగ్ లా కూడా ఈ ప్రధాన జాబితాలో ఉంది.
చాంగ్లాంగ్ జిల్లాలోని జైరాంపూర్ను కూడా చేర్చారు. ఈ పట్టణం ఒక ముఖ్య లాజిస్టికల్ కేంద్రంగా పనిచేస్తోంది. తూర్పు అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాలకు ముఖద్వారంగా పరిగణిస్తారు. ఇది ఈ ప్రాంతంలో భద్రతా దళాల కదలికలను సులభతరం చేస్తుంది.
ఈ ప్రాంతాల్లో అదనంగా, ఎత్తైన ప్రదేశంలోని శంభో సరోవర్ సరస్సుతో పాటు, తూర్పు అరుణాచల్ ప్రదేశ్లోని బారా కుందున్ , చోటా కుందున్ కూడా ఉన్నాయి. అధికారిక మేప్ లో గుర్తించిన ఇతర ప్రదేశాలలో ధన్ బారి, ప్రీత్నగర్, టెరిత్నగర్, రామ్నగర్ , తవాంగ్ రోడ్డుపై భారత సైనికుడు జస్వంత్ సింగ్ రావత్కు అంకితం చేసిన స్మారక చిహ్నం ఉన్న జస్వంత్ గఢ్ ఉన్నాయి. 1962 యుద్ధ వీరుడు త్రిలోక్ సింగ్ థాపాకు అంకితం చేసిన షేర్-ఎ-థాపా స్మారక చిహ్నంతో పాటు, సాగర్, పద్మ, జ్యోతినగర్, బైసాఖీ గ్రామాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అధికారికంగా గుర్తించిన ప్రాంతాలలో చోటా రోపుక్, బరా రోపుక్, శివాజీ నగర్, సున్పురా, కమ్లాంగ్ నగర్ (ఇవి కమ్లాంగ్ అభయారణ్యం సమీపంలో ఉన్నాయి) బుద్ధమందిర్ వంటివి కూడా ఉన్నాయి.
27-Places-India : చైనా పేర్లకు అడ్డుకట్ట
అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా “కల్పిత పేర్లను” పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను న్యూఢిల్లీ పదేపదే తోసిపుచ్చింది. ఇటువంటి ప్రయత్నాలు “ఆధారం లేని కథనాలను” సృష్టించే ఉద్దేశంతో కూడుకున్నవని, భారతదేశంలో అంతర్భాగంగా ఆ రాష్ట్రానికి ఉన్న “కాదనలేని వాస్తవికతను” ఇవి ఏమాత్రం మార్చలేవని భారత్ స్పష్టం చేసింది. అటువంటి చర్యలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నాలను క్లిష్టతరం చేయగలవని భారత ప్రభుత్వం హెచ్చరించింది.
అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాలకు ప్రామాణికమైనవిగా పేర్కొంటూ పేర్ల జాబితాలను ప్రచురించడాన్ని చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించింది .అప్పుడు ఆరు ప్రాంతాలకు పేర్లను విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలతో కూడిన రెండవ జాబితాను, అలాగే 2023లో 11 ప్రాంతాల పేర్లతో మరో జాబితాను ఆ దేశం విడుదల చేసింది.
27-Places-India : చైనాకు ఝలక్
చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2017లో అరుణాచల్ ప్రదేశ్లోని ఆరు ప్రాంతాలకు పేర్లను విడుదల చేస్తూ, ప్రామాణికమైనవిగా ఆ జాబితాలను ప్రచురించడం ప్రారంభించింది. 2021లో 15 ప్రాంతాలతో కూడిన రెండవ జాబితాను, ఆ తర్వాత 2023లో 11 ప్రాంతాల పేర్లతో మరో జాబితాను జారీ చేసింది. బీజింగ్ అరుణాచల్ ప్రదేశ్ను జాంగ్నాన్ అని పిలుస్తూ, ఆ భూభాగం దక్షిణ టిబెట్లో ఒక భాగమని వాదిస్తోంది. ఈ వాదనను భారత్ నిరంతరం తిరస్కరిస్తూ వస్తోంది. భారతదేశ అధికారిక పటంలో 27 ప్రాంతాలను లాంఛనంగా గుర్తించడం, ఏకపక్ష నామకరణ మార్పుల ద్వారా భౌగోళిక పేర్లకు , పరిపాలనా హక్కులను మార్చలేమనే న్యూఢిల్లీ వైఖరిని మరింత బలపరు
స్తోంది.. .
