Chityala | ఎన్నికలు పకడ్బంధీగా నిర్వహించాలి
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించే నామినేషన్ కేంద్రాలను గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లాసాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి (Korra Lakshmi) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా ఆమె నల్గొండ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)ని కలిసి జిల్లా కలెక్టర్ తో పాటు, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ లతో కలిసి చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామపంచాయతీ కార్యాలయంలో వెలిమినేడు క్లస్టర్ కు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నామినేషన్ కేంద్రంలో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ వద్దకు వెళ్లి అక్కడ నామినేషన్ పత్రాలు, నామిషన్లు వేసే సందర్భంగా అభ్యర్థులు పాటించవలసిన సూచనలు, ఇతర నియమ నిబంధనల కాఫీలు, నామినేషన్ పత్రంతో పాటు సమర్పించాల్సిన ధ్రువపత్రాలు పరిశీలించడమే కాకుండా హెల్ప్ డెస్క్ లోని ఉద్యోగులతో మాట్లాడారు.

అనంతరం నామినేషన్ల స్వీకరించే ఆర్ఓ గదిని (nomination centers), మెటీరియల్ ను, ఇతర ఏర్పాట్లను పరిశీలించి నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అనుసరిస్తున్న ప్రక్రియను అడిగి తెలుసుకుని ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య చిట్యాల ఇంచార్జ్ ఎమ్మార్వో బి విజయలక్ష్మి ఎంపీడీవో, ఎస్పీ జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

