Tirupati | భూసేకరణ పనులను వేగవంతం చేయాలి

Tirupati | భూసేకరణ పనులను వేగవంతం చేయాలి

గడువులోగా రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలి
క్రిస్, శ్రీ సిటీ దుగ్గరాజపట్నం పనుల్లో వేగం పెంచాలి
అధికారులకు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు


Tirupati | తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో పలు కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర (Collector Venkateswara) ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైల్వే ప్రాజెక్ట్ పనులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు, క్రిస్ సిటీ, ఏపీఐఐసీ సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీలోని ఎల్జి కంపెనీకి సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు.

కార్యక్రమానికి సదరన్ రైల్వేస్ సీపీఎం బిఎన్ఎస్ చలం, సంబంధిత మండలాల తహసీల్దార్లు, కాంట్రాక్టర్లు, హాజరయ్యారు. రైల్వే ప్రాజెక్ట్ పనులు (Railway project works), క్రిస్ సిటీ, ఏపీఐఐసీ సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీలోని ఎల్జి కంపెనీకి సంబంధించి ఫేస్-1, ఫేస్-2 అంశాలపై పలు భూ సంబంధిత పెండింగ్, వైజాగ్ చెన్నై కారిడార్ పైపు లైన్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector) మాట్లాడుతూ… తిరుపతి జిల్లాలో రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పురోగతిలో ఉన్న పనులపై రేణిగుంట- పూడి, రేణిగుంట-గూడూరు, బాలయ్యపల్లి- వెంకటగిరి ,రేణిగుంట- శ్రీకాళహస్తి, తిరుపతి-పాకాల, సదరన్ రైల్వేస్ అరక్కోణం-రేణిగుంట, గుమ్మడిపూడి-గూడూరు సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. క్రిస్ సిటీ కి సంబంధించి భూ సేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.

శ్రీ సిటీ లోని ఫేస్-1, ఫేస్-2 పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ లను (RDO’s) ఆదేశించారు. దుగ్గరాజపట్నం కు సంబందించి పెండింగ్ లో ఉన్న పనులను కూడా త్వరిత గతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. అలాగే అందరు అధికారులు కలసి సమన్వయంతో పెండింగ్ పనులను నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలన్నారు. ఏపీఐఐసీ ప్యాకేజీ 5, రోడ్లు, వైజాగ్ చెన్నై కారిడార్ పైపు లైను పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీవోలు, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, తిరుపతి, రైల్వే డిప్యూటీ సిఈ, వామణమూర్తి, రైల్వే ప్రాజెక్టు ఎఈ రాధాకృష్ణ, నెల్లూరు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు విజయ్ భరత్ రెడ్డి, ఎల్.శివకుమార్, డి.ఐ.సి జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, సత్యవేడు, వాకాడు, కోట సంబంధిత తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు , భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply