ఏపీలో మరోసారి ఐఏఎస్‌ బదిలీలు..

  • 12 మంది కొత్త కలెక్టర్లు నియామకం

ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారుల బదిలీలు వరుసగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గురువారం (ఆగస్టు 11) మరోసారి 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, వారిని వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవలే (ఆగస్టు 8న) 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం, కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి బ‌దిలీలు చేప‌ట్టింది.

జిల్లాల వారీగా కొత్త కలెక్టర్లు

  1. పార్వతీపురం మన్యం కలెక్టర్‌ – ప్రభాకర్‌ రెడ్డి
  2. విజయనగరం కలెక్టర్‌ – రామసుందర్‌రెడ్డి
  3. తూర్పుగోదావరి కలెక్టర్‌ – కీర్తి చేకూరి
  4. గుంటూరు కలెక్టర్‌ – తమీమ్‌ అన్సారియా
  5. పల్నాడు కలెక్టర్‌ – కృతిక శుక్లా
  6. బాపట్ల కలెక్టర్‌ – వినోద్‌ కుమార్‌
  7. ప్రకాశం కలెక్టర్‌ – రాజాబాబు
  8. నెల్లూరు కలెక్టర్‌ – హిమాన్షు శుక్లా
  9. అన్నమయ్య కలెక్టర్‌ – నిషాంత్‌ కుమార్‌
  10. కర్నూలు కలెక్టర్‌ – ఎ. సిరి
  11. అనంతపురం కలెక్టర్‌ – ఆనంద్‌
  12. సత్యసాయి కలెక్టర్‌ – శ్యాంప్రసాద్‌

Leave a Reply