- 12 మంది కొత్త కలెక్టర్లు నియామకం
ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు వరుసగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గురువారం (ఆగస్టు 11) మరోసారి 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, వారిని వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవలే (ఆగస్టు 8న) 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం, కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి బదిలీలు చేపట్టింది.
జిల్లాల వారీగా కొత్త కలెక్టర్లు
- పార్వతీపురం మన్యం కలెక్టర్ – ప్రభాకర్ రెడ్డి
- విజయనగరం కలెక్టర్ – రామసుందర్రెడ్డి
- తూర్పుగోదావరి కలెక్టర్ – కీర్తి చేకూరి
- గుంటూరు కలెక్టర్ – తమీమ్ అన్సారియా
- పల్నాడు కలెక్టర్ – కృతిక శుక్లా
- బాపట్ల కలెక్టర్ – వినోద్ కుమార్
- ప్రకాశం కలెక్టర్ – రాజాబాబు
- నెల్లూరు కలెక్టర్ – హిమాన్షు శుక్లా
- అన్నమయ్య కలెక్టర్ – నిషాంత్ కుమార్
- కర్నూలు కలెక్టర్ – ఎ. సిరి
- అనంతపురం కలెక్టర్ – ఆనంద్
- సత్యసాయి కలెక్టర్ – శ్యాంప్రసాద్

