నిర్మల్ ప్రతినిధి.బాసర జులై 18 ఆంధ్రప్రభ న్యూస్ ) బాసర పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బాసర ఐఐఐటీ వసతి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలను అందజేశారు.
అనంతరం జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. బాసర మండల కేంద్రంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మరికొద్దిసేపట్లో బాసర సరస్వతి దేవి అమ్మ వారిని మంత్రి దర్శించుకోనున్నారు.