IND vs ENG | టీమిండియా త‌డ‌బాటు.. మూడో టీ20 ఇంగ్లండ్ దే !

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో.. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా మూడో టీ20లో తడబడింది. రాజ్‌కోట్ వేదికగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జ‌ట్టు 171 ప‌రుగుల భారీ స్కోర్ న‌మోదు చేసింది.

అయితే 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య భారత జట్టు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కీలక బ్యాటర్లు త‌డ‌బ‌డ‌టంతో 145/9 ప‌రుగుల‌కు చేసి 26 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఓపెనర్ సంజూ శాంసన్ (3), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (14) మరోసారి నిరాశపరిచారు. ఇక‌ తొలి రెండు మ్యాచ్ ల్లో మెరిసిన యువ హీరోలు ఈ మ్యాచ్ లో విఫలమయ్యారు. అభిషేక్ శర్మ (24), తిలక్ వర్మ (18) ఔట‌య్యారు. హార్దిక్ పాండ్యా (40) రాణించినా గెలుపు ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.

టేయిలెండ‌ర్ల‌లో వాషింగ్టన్ సుందర్ (6), అక్షర్ పటేల్ (15), ధ్రువ్ జురెల్ (2) పరుగులకే వెనుదిరిగారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఒవెర్టన్ (3/24), జోఫ్రా ఆర్చర్ (2/33), బ్రైడన్ కార్స్ (2/28), మార్క్ ఉడ్ (1/29), అదిల్ రషీద్ (1/15) వికెట్లు తీశారు.

కాగా, ఈ విజయంతో ఇంగ్లండ్‌ జట్టు సిరీస్‌లో భారత్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జనవరి 31న పుణెలో జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *