Encounter | ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి..

నారాయణపూర్ : మావోయిస్టులకు మ‌రోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు (Two Maoists) మృతి చెందారు. మావోయిస్టులకు కంచుకోట అయిన అబుజ్‌మడ్‌ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురుకాల్పుల అనంతరం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

సంఘటనా స్థలం నుంచి ఇన్సాస్‌ రైఫిల్‌తో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఎన్‌కౌంటర్ (Encounter) జరిగిన ప్రమాదం పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే బలగాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో డీఆర్‌జీ నారాయణపూర్‌, కొండగావ్‌, ఎస్‌టీఎఫ్‌ అబుజ్‌మడ్‌ ప్రాంతంలో ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌లో భారీగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఇటీవల కొంతకాలంగా వందలాది మంది మావోలు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. వచ్చ ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) ప్రకటించారు. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేరుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యూహత్యకంగా అడుగులు వేస్తూ వెళ్తున్నది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలు సైతం ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Leave a Reply