న్యూ ఢిల్లీ – పాక్ రేంజర్ల అదుపులో ఉన్న బిఎస్ ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను ఆ దేశం తిరిగి భారత్ కు నేడు అప్పగించింది. అటారీ-వాఘా బార్డర్ ద్వారా అతడిని మనదేశానికి పంపింది. గత నెల 23న పాక్ సరిహద్దులోకి అనుకోకుండా ప్రవేశించిన జవాన్ను పాక్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తన భర్త తిరిగొచ్చేలా చూడాలని ఆయన భార్య ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీనిపై పాక్ రేంజర్లతో భారత్ అధికారులు చర్చలు జరిపారు.. అవి ఫలప్రదం కావడంతో పూర్ణమ్ కుమార్ ను విడుదలయ్యారు..
Released | భారత జవాన్ ను తిరిగి అప్పగించిన పాక్
