వందేమాతరం వేళ వివాదం.. సోనియా గాంధీపై ఫిర్యాదు..
సోనియాపై బీజేపీ నేత ఫిర్యాదు
ఆపాలని సూచించారంటూ ఆరోపణ
చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ‘వందేమాతరం’ గీతాలాపన సమయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై బీజేపీ నేత వికాస్ పుత్తూర్ అధికారికంగా ఫిర్యాదు చేశారు. వందేమాతరం గీతాన్ని అడ్డుకునేలా ఆమె పార్టీ కార్యకర్తలకు సూచనలు చేశారని ఆయన ఆరోపించారు.
ఈ అంశంపై స్పందించిన వికాస్ పుత్తూర్.. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక వైఖరి ఉందని ఆరోపించారు. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో జరిగిన పరిణామాలను దేశ ప్రజలు గమనించారని పేర్కొన్నారు. సోనియా గాంధీ పార్టీ క్యాడర్ను వందేమాతరం ఆపాలని సూచించారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారంపై తాను అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వికాస్ పుత్తూర్ తెలిపారు. వందేమాతరం గీతాన్ని నిలిపివేయాలని సూచించడం చట్టపరమైన చర్యలకు కారణమయ్యే అంశమని ఆయన పేర్కొన్నారు. అయితే సోనియా గాంధీ ఉద్దేశపూర్వకంగా వందేమాతరాన్ని ఆపాలని సూచించినట్లు చేసిన ఈ ఆరోపణలపై స్వతంత్ర ధ్రువీకరణ లేదు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వందేమాతరం గీతం సందర్భంగా అసలేం జరిగిందన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బీజేపీ నేత ఫిర్యాదుతో ఈ అంశం మరింత రాజకీయ వివాదానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది.
