RCB vs CSK | చెన్నైపై విరాట్ రికార్డ్ !

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా ఈరోజు శ‌నివారం బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ఆర్సీబీ స్టార్ ప్లేయ‌ర్, ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 33 బంతుల్లో 62 ప‌రుగులు చేసిన కోహ్లీ.. ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు (1146) చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

దాంతో విరాట్ కోహ్లీ డేవిడ్ వార్న‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. పంజాబ్ కింగ్స్ పై డేవిడ్ వార్న‌ర్ 26 మ్యాచ్‌ల్లో 1134 ప‌రుగులు చేశాడు. విరాట్ కోహ్లీ చెన్నై సూప‌ర్ కింగ్స్ పై 35 మ్యాచ్‌ల్లో 1146 ప‌రుగులు సాధించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై 1130 పరుగులు, పంజాబ్ కింగ్స్‌పై 1104 పరుగులు చేశాడు కోహ్లీ. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్లపై 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కూడా నిలిచాడు.

ఐపీఎల్‌లో ఒక జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

  • విరాట్ కోహ్లీ – 1146 ప‌రుగులు (చెన్నై సూప‌ర్ కింగ్స్ పై)
  • డేవిడ్ వార్న‌ర్ – 1134 ప‌రుగులు (పంజాబ్ కింగ్స్‌పై)
  • విరాట్ కోహ్లీ – 1130 ప‌రుగులు (ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై)
  • విరాట్ కోహ్లీ – 1104 ప‌రుగులు (పంజాబ్ కింగ్స్ పై)
  • డేవిడ్ వార్న‌ర్ – 1093 ప‌రుగులు (కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పై)
  • రోహిత్ శ‌ర్మ – 1083 ప‌రుగులు (కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్ పై)

Leave a Reply