వెలగపూడి : ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఉదయం 10గంటలకు ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఫలితాలను
https://bse.ap.gov.in
మనమిత్ర వాట్సాప్ యాప్ లో విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చు. .
పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణులయ్యారు.
అలాగే 1,680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు కాగా… పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఈ ఫలితాలు చాలా సంతోషాన్నిచ్చాయి: మంత్రి నారా లోకేశ్
“ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా… 4,98,585 మంది ఉత్తీర్ణులై 81.14% ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉండటం, 1,680 పాఠశాలలు 100% ఫలితాలు సాధించడం చూసి నేను సంతోషంగా ఉన్నాను.
ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. విజయం సాధించని వారు నిరుత్సాహపడకండి. జీవితం రెండవ అవకాశాలను అందిస్తుంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28 వరకు జరుగుతాయి. ఇది విజయం సాధించడానికి మరొక అవకాశాన్ని అందిస్తుంది. ఫలితాల కోసం http:// bse.ap.gov.in, http:// results.bse.ap.gov.in తో పాటు వాట్సాప్ (మన మిత్ర): 95523 00009 కు ‘హాయ్’ అని పంపండి” అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇదిలాఉంటే.. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా టెన్త్ ఫలితాలతో పాటే విడుదల చేశారు
.వాట్సాప్ లో ఫలితాలు ఇలా..◊ విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ వాట్సాప్ లో 9552300009 నంబర్కు “Hi” అని మెసేజ్ చేయాలి.◊ వెంటనే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.◊ అందులో విద్యా సేవలను ఎంచుకోవాలి.◊ అనంతరం SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను సెలక్ట్ చేయాలి.◊ అక్కడ రోల్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.◊ ఈ రిజల్ట్ పీడీఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
