Trump Shock : టెకీలకు ట్రంప్​ షాక్​ Andhra Prabha

Trump Shock : టెకీలకు ట్రంప్​ షాక్​ Andhra Prabha

  • అధ్యక్షుడి నిర్ణయంతో టెకీల్లో కలకలం
  • ఏఐ ఉత్తర్వులపై వెనుకడుగు
  • చైనాపై ఆధిపత్యమే లక్ష్యం
  • భద్రతా పరీక్షల నిబంధనలపై వివాదం
  • ఎలాన్ మస్క్, మెటా సహా టెక్ దిగ్గజాల అభ్యంతరాలు
  • శ్వేతసౌధం కార్యక్రమానికి సీఈఓల గైర్హాజరీ
  • భవిష్యత్తులో మార్పులతో కొత్త ఉత్తర్వుల అవకాశం

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్​ ప్రతినిధి )

Trump Shock

కృత్రిమ మేథస్సు పరిశోధనల్లో టెకీలకు అమెరికా అధ్యక్షుడు గట్టి షాక్​ ఇచ్చారు. ఏఐ కార్యనిర్వాహక ఉత్తర్వును తిప్పికొట్టారు. ఇక టెకీలు సైతం అధ్యక్షుడు చర్చలను విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గురువారం వైట్ హౌస్‌లో అగ్రశ్రేణి సీఈఓలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు, ఎందుకంటే ఆ ఉత్తర్వులోని కొన్ని భాగాలు తనకు నచ్చలేదని ఆయన అన్నారు.
అమెరికా సాంకేతిక ఆధిపత్యం ఆవిష్కరణల (Innovation) వేగం తగ్గిపోతుందనే ఆయన భావించారు, ఈ ఉత్తర్వులోని కొన్ని నిబంధనలు టెక్నాలజీ రంగానికి ఆటంకం కలిగిస్తాయని ఆయన భావించారు.

Trump Shock : చైనా కంటే అమెరికా వెనుకబడిపోతుందని ట్రంప్​ భయం వ్యక్తం చేశారు. ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం AI రంగంలో అమెరికా చైనా కంటే చాలా ముందుందని, ఆ ఆధిక్యాన్ని దెబ్బతీసే ఎలాంటి నిబంధనలను తాను అంగీకరించనని స్పష్టం చేశారు. ప్రభుత్వ నియంత్రణల వల్ల కొత్త మోడల్స్ అభివృద్ధి నెమ్మదిస్తే, చైనా దీనిని క్యాష్ చేసుకునే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉత్తర్వు ప్రకారం, కొత్తగా తయారుచేసే అత్యంత శక్తివంత AI మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి 14 నుంచి 90 రోజుల ముందే ప్రభుత్వానికి సమర్పించి, భద్రతా పరీక్షలు (Safety screening) చేయించుకోవాలని ప్రతిపాదించారు.
ఈ ముందస్తు నిబంధనల వల్ల టెక్ కంపెనీల కొత్త టెక్నాలజీ లాంచ్‌లు ఆలస్యమవుతాయని, ఇది వ్యాపారాలకు పెద్ద నష్టమని భావించారు. ఎలోన్ మస్క్ (xAI), మార్క్ జుకర్‌బర్గ్ (Meta) , ట్రంప్ సన్నిహితుడు డేవిడ్ సాక్స్ వంటి టెక్ దిగ్గజాలు ఈ నిబంధనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చారు. టెక్ పరిశ్రమ ప్రతినిధులు ఈ గడువును వీలైనంత తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ మొదటి నుండి AI రంగంలో “డీరెగ్యులేషన్” (నిబంధనల సడలింపు) విధానాన్ని నమ్ముతున్నారు. జో బైడెన్ హయాంలో తెచ్చిన కఠినమైన AI భద్రతా నిబంధనలను ట్రంప్ అధికారంలోకి రాగానే రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు కొత్త ఉత్తర్వు ద్వారా ప్రభుత్వం AI కంపెనీలపై పర్యవేక్షణ పెంచడం ట్రంప్‌కు నచ్చలేదు. కొత్త AI మోడల్స్‌ను ఏ ప్రభుత్వ సంస్థ సమీక్షించాలనే దానిపై కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) లేదా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీకి ఈ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని టెక్ పరిశ్రమ వర్గాలు కోరాయి, కానీ ముసాయిదాలో ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా జోక్యం చేసుకునేలా నిబంధనలు ఉండటం వివాదానికి కారణమైంది.

Trump Shock : సీఈఓల గైర్హాజరీ

Trump Shock

ఈ సంతకాల కార్యక్రమానికి శ్వేతసౌధం చాలా తక్కువ సమయంలో ఆహ్వానాలు పంపడం వల్ల, ఓపెన్ ఏఐ (OpenAI), ఆంత్రోపిక్ (Anthropic), మెటా (Meta) వంటి అగ్రశ్రేణి కంపెనీల ప్రధాన సీఈఓలు (CEOs) స్వయంగా హాజరుకాలేకపోయారు. వారి స్థానంలో కింది స్థాయి అధికారులను పంపాలని నిర్ణయించడంతో, ట్రంప్ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడానికి ఇది కూడా ఒక కారణమైంది.ప్రస్తుత పరిస్థితి:ప్రస్తుతానికి ఈ ఉత్తర్వును పూర్తిగా రద్దు చేయలేదు. టెక్ పరిశ్రమకు నష్టం జరగకుండా, అమెరికా భద్రతను కాపాడుతూ మార్పులు చేసిన తర్వాత భవిష్యత్తులో దీనిపై సంతకం చేసే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి

ALSO READ : Russia China Strategic : దోస్త్ మేరా..దోస్త్..Andhra Prabha Top Story