స్వాగతం పలికిన అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి దర్శించుకున్నారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి వనదుర్గ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.