Katan Pally | బీఆర్ఎస్ బంద్ సక్సెస్.. కృతజ్ఞతలు తెలిపిన నేతలు

Katan Pally | బీఆర్ఎస్ బంద్ సక్సెస్.. కృతజ్ఞతలు తెలిపిన నేతలు
Katan Pally | క్యాతన్ పల్లి,ఆంధ్ర ప్రభ: క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్మన్,వైస్ ఛైర్మన్ ఎన్నికను నిరసిస్తూ బిఆర్ఎస్,సిపిఐ ఇచ్చిన క్యాతన్ పల్లి మున్సిపాలిటీ బంద్ పిలుపు స్వాగతిస్తూ ప్రజలు, వ్యాపారులు పూర్తి మద్దతు తెలిపి విజయవంతం చేసేందుకు బిఆర్ఎస్,సిపిఐ నాయకులు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ఎండీ అక్బర్ అలీ, బిఆర్ఎస్ నాయకుడు కంది క్రాంతి మాట్లాడుతూ పోలీసులు రామకృష్ణాపూర్ పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం,వ్యాపారస్తులు స్వచ్చందంగా దుకాణాలు మూసి బంద్ కు సహకరించారని అన్నారు.
పట్టణ ప్రజలు పూర్తిస్థాయిలో బంద్ కు సహకరించడం జిల్లావ్యాప్తంగా రాజకీయవర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని అన్నారు.మంత్రి వివేక్ వెంకటస్వామి రెండుసార్లు ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయించడం సరికాదని, సిపిఐ,బిఆర్ఎస్ కౌన్సిల్ కు సరిపోయే 14 మంది అభ్యర్థులు ఉన్నా కూడా పోరంలేదని అదేవిధంగా కాంగ్రెస్ వాళ్లే కౌన్సిల్ సమావేశంలో గొడవకు దిగడం,మహిళలపై దౌర్జన్యం చేయడం సరికాదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సుమన్ ను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అన్నారు. సుమన్ అరెస్ట్ ను నిరసిస్తూ జిల్లా నాయకులు బంద్ కు పిలుపును ఇచ్చినట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో శైలజ,దేవేంద్ర, దేవానందం,సంపత్ తదితరులు పాల్గొన్నారు.
