- 49 టాప్ కంపెనీలు.. 10 వేలకు పైగా ఉద్యోగాలు
- పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి లోకేష్
రాష్ట్రంలోని నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త అందించారు. విశాఖలోని గీతం యూనివర్శిటీలో అతిపెద్ద కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 49 అగ్రశ్రేణి ఐటీ, ఐటీఏఎస్ కంపెనీలతో కలిపి 10,000కు పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన గురువారం సాయంత్రం విడుదల చేశారు.
కాగా, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) మార్చి 5, 6 తేదీల్లో ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్తో కలిసి ఈ ఫెయిర్ను నిర్వహిస్తోంది. అభ్యర్థులు మార్చి 3లోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని… ఈ కెరీర్ ఫెయిర్ లో భాగస్వాములు కావాలని లోకేశ్ సూచించారు.