విద్యా వనరులను బలోపేతం చేసుకునే లక్ష్యంతో విద్యా వేదిక‌ పీడ‌బ్ల్యూ ఆనంద రామ‌న్

హైద‌రాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ ) : హైదరాబాద్‌లోని పీడ‌బ్ల్యూ విద్యాపీఠ్‌లో తన విద్యా వనరులను బలోపేతం చేసుకునే లక్ష్యంతో విద్యా వేదిక ఫిజిక్స్‌వాలా (పీడ‌బ్ల్యూ) ఆనంద రామన్‌ తో పాటు 25మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులను నియమించుకుంది.

ఆనంద రామన్ (మాజీ-ఫిట్జీ డైరెక్టర్) విద్యార్థులకు రసాయన శా….స్త్రాన్ని బోధించడంలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ఈ కార్యక్రమ సందర్భాన్ని పురస్కరించుకుని, ఫిజిక్స్‌వాలా వారిచే ఒక ఫ్యాకల్టీ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించబడింది.

ఇది ఫ్యాకల్టీ సభ్యులను సంఘటితం చేసి తీసుకువచ్చి వారి విద్యావిషయక వ్యూహాలను సమన్వయం చేసుకొని అనువుగా చేయడానికి ఒకచోటకు చేర్చింది. హైదరాబాద్‌లోని వివిధ పీడ‌బ్ల్యూ విద్యాపీఠ్ కేంద్రాల్లో నమోదు కాబడిన విద్యార్థులకు విద్యను అందించడంలో ఫిజిక్స్‌వాలా ధ్యేయాన్ని ఈ కార్యక్రమం ఎత్తి చూపింది.

ఈ సందర్భంగా ఫిజిక్స్‌వాలా (పీడ‌బ్ల్యూ) నుండి ఒక ప్రతినిధి మాట్లాడుతూ… పీడ‌బ్ల్యూ యందు తాము, ప్రతి చిన్నారి కూడా విద్యను అందుకోవడానికి మద్దతు ఇవ్వబడే విద్యా విషయాలను బలోపేతం చేసే ధ్యేయాన్ని కలిగి ఉన్నామన్నారు. ఆనంద్ సర్, ఇతర ఫ్యాకల్టీ సభ్యుల అనుభవం, హితబోధన విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో మార్గదర్శనం, మద్దతు పొందడానికి సహాయపడుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *