TDP MLA | ఏపీలోనూ క్యాన్సర్ ఆసుపత్రి.. త్వ‌ర‌లోనే ప్రారంభం : బాల‌కృష్ణ

బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని మ‌రింత విస్త‌రించ‌నున్న‌ట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలియజేశారు. విస్త‌ర‌ణ‌లో భాగంగా ఏపీలోని తుళ్లూరులో మ‌రో ఎనిమిది నెల‌ల్లో ఆసుప‌త్రిని ప్రారంభిస్తామ‌ని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిని దృష్టిలోని పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఈరోజు హైద‌రాబాద్ లోని క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో ఆంకాల‌జీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ… పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. క్యాన్సర్ బాధితులు మ‌నోధైర్యంతో ఉంటే క‌చ్చితంగా కోలుకుంటార‌ని బాలకృష్ణ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *