బీసీసీఐ కీలక నిర్ణయం ఇదే..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : దేశవాళీ క్రికెట్ (domestic cricket)లో బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గాయపడిన ఆటగాళ్లు మ్యాచ్‌లో కొనసాగుతూ తమను తాము మరింత ప్రమాదంలో పడకుండా నిరోధించడానికి దేశవాళీ క్రికెట్‌లో ఆటగాళ్ల భర్తీకి బీసీసీఐ అవకాశం కల్పించింది. అంటే.. మ్యాచ్ సందర్భంగా ఆటగాడు (Player) తీవ్రంగా గాయపడితే అతని స్థానంలో అలాంటి మరో అటగాణ్ని అనుమతించవచ్చునని సవరించిన ఆట నిబంధనల్లో బీసీసీఐ (rules of the game) పేర్కొంది. ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ (Duleep Trophy) నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్లు బీసీసీఐ (BCCI) తెలిపింది.

కొత్త నిబంధన అమలు ఇలా..
♦ మ్యాచ్ మధ్యలో బంతి తగలడం ద్వారా ఫ్రాక్చర్ లేదా డిస్‌లొకేషన్ వంటి తీవ్రమైన గాయాలు (Serious Injuries) జరిగి, అతడు మ్యాచ్‌లో ఆడే పరిస్థితి లేనప్పుడు మరో ఆటగాడిని తీసుకుంటారు.
♦ మొదట ఫీల్డ్ అంపైర్ (Field Umpire) గాయం తీవ్రతను పరిశీలిస్తారు. అవసరమైతే మ్యాచ్ రిఫరీ, డాక్టర్ల సలహా తీసుకుంటారు.
♦ ఆ తర్వాత గాయపడ్డ ఆటగాడికి సంబంధించిన టీమ్ మేనేజర్ గాయం తీవ్రతపై లిఖిత పూర్వకంగా మ్యాచ్ రిఫరీకి వివరాలు చెప్పాలి.
♦ ఒకసారి ప్రత్యామ్నాయ ఆటగాడు మైదానంలోకి వస్తే.. గాయపడిన ఆటగాడు మళ్లీ ఆ మ్యాచ్ ఆడలేడు.
♦ ప్రత్యామ్నాయ ఆటగాడి విషయంలో తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీదే.
♦ ఏ జట్టుకు కూడా దీనిపై అప్పీల్ చేసే హక్కు ఉండదు.

Leave a Reply