హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు ఆయన అడ్మిట్ అయ్యారు. కేసీఆర్ కు మరోసారి డాక్టర్లు (Doctors) వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈనెల 3న కూడా ఆయన యశోద ఆసుపత్రి (Yashoda Hospital) లో చేరారు. అప్పడు బ్లడ్ షుగర్, సోడియం స్థాయులు మానిటర్ చేయడానికి రెండ్రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈనెల 5న డిశ్చార్జి అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జి సమయంలో వైద్యులు తెలిపారు. ఈక్రమంలో వైద్య పరీక్షల కోసం కేసీఆర్ మళ్లీ యశోద ఆసుపత్రిలో చేరారు.
HYD| మరోసారి యశోద ఆస్పత్రికి కేసీఆర్
