హైదరాబాద్ : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్), మిమాపూర్ (Mimapur) కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 28న జగన్నాధ రథయాత్ర నిర్వహిస్తున్నామని మియాపూర్ ఇస్కాన్ టెంపుల్ (Miyapur ISKCON Temple) అధ్యక్షులు శ్రీరాందాస ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రభూజీ మాట్లాడుతూ.. ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చందానగర్ లోని ఆర్.ఎస్. బ్రదర్స్ వద్ద ఈ రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు.
రథయాత్ర (Rath Yatra) మదీనగూడ, అల్వీన్ క్రాస్ రోడ్, మియాపూర్ క్రాస్ రోడ్, జె.పి.నగర్ వీధుల గుండా కొనసాగుతూ విశ్వనాథ గార్డెన్ వద్ద ముగుస్తుందన్నారు. ఈ రథయాత్ర దారి పొడువునా భక్తుల సౌకర్యార్థం తాగునీరు, పులిహోర ప్రసాదం అందజేయటం జరుగుతుందని, యాత్రలో వివిధ రకాల సంకీర్తనలతో, నృత్యాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదేరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ విశ్వనాధ గార్డెన్ లో సమావేశం ఉంటుందని, ఇందులో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యకమాలు, ప్రభూజీల ప్రసంగాలు ఉంటాయని, అనంతరం భక్తులకు అన్నపుసాదం వితరణ ఉంటుందని తెలపారు. రథయత్ర సమావేశంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీరాందాస విజ్ఞప్తి చేశారు.