న్యూ ఢిల్లీ – సింధు జలాలను నిలిపివేయడంతో తాగు నీరుకు అల్లాడిపోతున్నామని, మా దేశ ప్రజలు నోళ్లు ఎండిపోతున్నాయని పాకిస్థాన్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే ఈ జలాల ఒప్పందాన్ని సమీక్షించి నీళ్లు వదలని బారత్ ను కోరింది పాక్.. ఈ మేరకు భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది. పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. చర్చలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సున్నితమైన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అభ్యర్థించారు. సిందు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని సృష్టిస్తుందని పాక్ భారత్ కు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం సైతం పాక్ లేఖ రాసిన విషయాన్ని ధ్రువీకరించింది.
Water Please | గొంతులు ఎండుతున్నాయి… నీళ్లు వదలండిః భారత్ కు పాక్ లేఖ
