Indian-Ship-Attacked : భారతీయ నౌకపై దాడి Andhra Prabha Top News
Indian-Ship-Attacked : భారతీయ నౌకపై దాడి Andhra Prabha Top News
- 14 మంది నావికులు సురక్షితం
- కాపాడిన యెమెన్ నావికాదళం
- ఎర్రసముద్రంలో పైచాచికత్వం
- కంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్ర ఖండన
(ఆంధ్రప్రభచ రియాద్ )

Indian-Ship-Attacked : ఎర్రసముద్రంలో తొలిసారిగా భారత సౌకపై దాడి అలజడి రేపింది. పేలుడు పదారా్థాల బోటుతో ముష్కరులు ఈ దాడి చేశారు. మెమెన్ నావికాదళం తక్షణమే స్పందించి 14 మంది భారతీయ నావికులను కాపాడారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎర్ర సముద్రంలో యెమెన్ జలాల సమీపంలో ఎంఎస్వి ఫైజ్ నూరే ఓలియా అనే భారతీయ నౌకపై దాడిత అది మునిగిపోయేఏ స్థితిలో ఓడ బోల్తా పడింది. ఈ సమాచారాన్ని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. యెమెన్ పశ్చిమ తీరంలో పేలుడు పదార్థాలతో నిండిన పడవతో ఈ నౌకపై దాడి జరిగిందని యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ బృందమూ బాధ్యత వహించలేదు. ఎర్ర సముద్రంలో భారత నౌకపై జరిగిన తొడి దాడి ఇదే. ఈ ఘటనను భారత నౌకపై జరిగిన “కారణం లేని దాడి”గా సోనోవాల్ అభివర్ణించారు భారత నావికుల భద్రతను నిర్ధారించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు.
నౌకలోని 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్ గార్డ్ రక్షించి మోఖా ఓడ రేవుకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలోని భారత నావికుల భద్రతను నిర్ధారించడానికి సురక్షితత సిబ్బందికి సహాయం అందించడానికి ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి డైరెక్టర్ జనరల్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ను ఆదేశించారు.
Indian-Ship-Attacked భారత్ తీవ్ర ఆగ్రహం

ఆగస్టు 4న యెమెన్ తీరంలో ఓడ మునిగిపోయిందని, అందులో 13 మంది భారత జాతీయులను రక్షించామని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ దాడిని ఖండించింది. రియాద్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి యెమెన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్లో సహకరించినందుకు యెమెన్ అధికారులకు MEA ధన్యవాదాలు తెలిపింది.
Indian-Ship-Attacked భారత్ ఆందోళన
ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న దాడులపై మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది, ఈ ఘటనలను “తీవ్ర ఆందోళనకరమైనవి”గా అభివర్ణించింది. వాణిజ్య నౌకలపై దాడులు ఆగాలని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానం వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని భారత్ పిలుపునిచ్చింది. ఆ నౌక నుంచి కాపాడామని 14 మందిని ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని యెమెన్ అధికారులు తెలిపారు. ఈ ప్రకటన వెలువడే సమయానికి, ఈ దాడికి ఏ సమూహమూ బాధ్యత ప్రకటించుకోలేదు.
