ADB | జ‌న్నారం మండ‌లం.. టెన్త్ లో 100 శాతం ఉత్తీర్ణత

జన్నారం, ఎప్రిల్ 30 (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో టెన్త్ లో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు స్థానిక ఎంఈఓ విజయకుమార్ తెలిపారు. గత మార్చి నెలలో నిర్వహించిన పదో తరగతి ఫలితాలను బుధవారం ప్రకటించారు. మండలంలో 12 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలు, 2 ప్రభుత్వ గిరిజన ఆశ్రమోన్నత, ఒక కేజీబీవీ, 3 ప్రైవేటు హైస్కూల్ లలో 620మంది పదోతరగతి విద్యార్థులు అప్పుడు పరీక్షలు రాయగా, 620 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన చెప్పారు. మండలంలోని కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన రాథోడ్ యోగేశ్వర్ 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలువగా, అదే పాఠశాలకు చెందిన వేల్పుల నరేందర్ 570 మార్కులు సాధించి మండల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ఆయన చెప్పారు.

టెన్త్ లో ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులను అభినందించిన ఎంఈఓ
మండలంలోని కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి రాథోడ్ యోగేశ్వర్ 600 మార్కులకుగాను 582 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించగా,అదే పాఠశాలకు చెందిన వేల్పుల నరేందర్ 570 మార్కులు పొంది మండల స్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు.ఈ సందర్భంగా ఆ విద్యార్థులను ఎంఈఓ విజయకుమార్,కిష్టాపూర్ పాఠశాల హెచ్.ఎం రాజన్న,ఉపాధ్యాయులు దాముక కమలాకర్,ప్రకాష్ బానావత్,ఎదులాపురం గోవర్ధనచారి,గుండి నరహరి శర్మ, ఇతర టీచర్ల బృందం,నేతలు గుర్రం మోహన్ రెడ్డి, మచ్చ శంకరయ్య,గాజుల మల్లేష్, గట్టు మహేష్, గాజుల దేవేందర్, తదితరులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *