- వేస్ట్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్లో కీలక ఘట్టం
- దశల వారి సాలిడ్ వేస్ట్ తలగింపు కోసం ఒప్పందం
- రెండు సంస్థలతో ఎంఈఓ కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం
- స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి సమక్షంలో అగ్రిమెంట్…
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కు ఒక అడుగు ముందుకు పడింది. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం వస్తున్న వేస్ట్ ను ప్రాసెసింగ్ చేయడంతో పాటు సాలిడ్ వేస్ట్ తొలగింపు కోసం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దశలవారీగా అన్ని ప్రాంతాలలో ఉన్న సాలిడ్ వేస్ట్ తొలగింపు కోసం ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
రెండు సంస్థలతో కుదిరిన ఎంఓయు స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కామారెడ్డి పట్టాభిరామ్ ఆధ్వర్యంలో మంగళవారం అధికారులు నిర్వహించారు. వేస్ట్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఐటీసీ ఈ – వేస్ట్ (ఎలక్ట్రానిక్ వేస్ట్ )కి సంబంధించి రీ సోటబిలిటీ సంస్థలతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మెమొరాండం అఫ్ అండర్ స్టాడింగ్ కుదుర్చుకుంది.
వేస్ట్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ కి సంబంధించి సిద్ధిపేటలో ఐటీసీ కంపెనీ చేస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలుసుకుని స్వయంగా అక్కడికి వెళ్లి చూసి అప్పుడే ఐటీసీ కంపెనీ యాజమాన్యంతో మీ సహకారం రాష్ట్రానికి కావాలని చైర్మన్ పట్టాభిరామ్ అభ్యర్థించి, వారిని ఒప్పించారు.
ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నకుప్పంతో పాటు పిఠాపురం, ఒంగోలు, తిరుపతి ,కడప, మంగళగిరి లాంటి 30 యుఎల్బిఎస్ (అండర్ లెవెల్ బాడీస్) అలాగే 5 వేల స్కూల్స్ లలో దశల వారీగా సాలిడ్ వేస్ట్ ని వెల్ బీయింగ్ అవుట్ అఫ్ వేస్ట్ అనే ప్రోగ్రాం ద్వారా చేస్తారని పట్టాభిరామ్ తెలిపారు.
ముందుగా కొంతమంది ఎన్జీఓ లని ఏర్పాటు చేసుకుని ఇళ్లలోనే తడి చెత్త ని,పొడి చెత్తని ఏ విధంగా వేరు చేయాలనే అంశం మీద అవగహన కల్పిస్తారని అలాగే వేస్ట్ ని ఎలా కలెక్ట్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వడం అలాగే విద్యార్థుల్లో చైతన్యం కలిగే విధంగా ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం దానితో పాటు ఎన్జీఓ లకి , యు ఎల్ బి స్టాఫ్ కి వేస్ట్ ప్రాసెసింగ్ ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంని ఐటీసీ సంస్థ కండక్ట్ చేస్తుందని పట్టాభిరామ్ తెలిపారు.
మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ కార్యకలాపాలకు వివిధ విభాగాల నుండి అవసరమైన అనుమతులు కావలసిన లైసెన్సుల ఏర్పాటు అలాగే స్కూల్స్ ,కాలేజ్ లలో విద్యార్థులకి అవగహన కల్పించడానికి కావలసిన అనుమతులు అలాగే చెత్త ప్రాసెస్ చేయడానికి అవసరమైన షేడ్స్ ,బెయిలింగ్ మెషీన్స్ ,కంపోస్టింగ్ యూనిట్స్ , మాన్ పవర్ ను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తమ వంతు సహకారంగా అందిస్తుందన్నారు.
ప్రస్తుతం ఈ – వేస్ట్ కూడా రాష్ట్రం లో ఎక్కువగా జనరేట్ అవుతుందని ప్రపంచ వ్యాప్తంగా ఈ – వేస్ట్ ఎక్కువగా జనరేట్ అవుతున్న దేశాలలో మన దేశం మూడవ స్తానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఈ వేస్ట్ ను ప్రాసెసింగ్ చేసేందుకు పైలట్ ప్రైజెక్టు కింద విజయవాడలో ఐదు వేల అడుగుల విస్తీర్ణంలో ఈ వేస్ట్ సేకరణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ – వేస్ట్ ని సహకరించడంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పగించి చేసి వారికి ఎంప్లాయిమెంట్ కల్పించే విధంగా తోడ్పాటు ఉంటుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిడిఎంఏ కమీషనర్ పి.సంపత్ కుమార్,స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బి.అనిల్ కుమార్ రెడ్డి,కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ భావన, 30 మునిసిపాలిటీలకి సంబంధించిన మునిసిపల్ కమీషనర్లు పాల్గొన్నారు.