హైదరాబాద్ : హీరో మహేష్బాబుకు ఈడీ. నోటీసులు జారీచేసింది. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 28న విచారణకు రావాలంటూ మహేష్కు నోటీసులు పంపారు. ప్రమోషన్ కింద రూ. 3.4 కోట్లు తీసుకున్నట్టు గుర్తించిన ఈడీ. ఈనెల 16న ఈడీ. హైదరాబాద్ సోదాలు చేసింది. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ ఆఫీసులతోపాటు, ఈ సంస్థల అధినేతల ఇళ్లపై ఈడీ. దాడులు చేసింది .ఆ తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా మహేష్ ఈనెల 28న ఉదయం 10. 30 నిమిషాలకు హైదరాబాద్ లోని ఈడి హెడ్ క్వార్టర్స్ కి రావాలని నోటీసులు జారీ చేశారు అధికారులు.
ఈ యాడ్ కోసం మహేష్ బాబు మొత్తం 5 కోట్ల 90 లక్షలు తీసుకున్నట్టు గుర్తించారు. రూ. 3.4 కోట్లు చెక్, 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో మహేష్ తీసుకున్నట్టు గుర్తించారు. సాయి సూర్య డెవలపర్ ఎండీ సతీష్ చంద్ర ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ ద్వారా వెలుగులోకి వచ్చింది ఈ విషయం. మహేష్ బాబు భార్య పిల్లలతో కలిసి సాయిసూర్య డెవలపర్స్ యాడ్ లో నటించాడు.