ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. హర్యానాలోని శిఖోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ సమన్లు పంపారు. అయితే, ఈ కేసులో ఏప్రిల్ 8న మొదటిసారి జారీ చేసిన సమన్లను వాద్రా దాటవేయడంతో.. ఇప్పుడు రెండోసారి జారీ చేశారు.
వాద్రా కంపెనీ ఫిబ్రవరి 2008లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు గుర్గావ్లోని శిఖోపూర్లో 3.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అనంతరం ఈ భూమిని వాద్రా కంపెనీ రూ.58 కోట్లకు రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్కి విక్రయించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. దీంతో విచారణకు రావాల్సిందిగా వాద్రాను ఈడీ ఆదేశించింది.