వినతి పత్రం అందజేత..

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రూర్బన్ పథకంలో నిర్మించిన ఫంక్షన్ హాల్ నిర్వహణకు ఓపెన్ టెండర్ నిర్వహించాలని గ్రామ మాజీ వార్డ్ సభ్యుడు పురం శేఖర్ అన్నారు. టెండర్ లేకుండా ఫంక్షన్ హాల్ నిర్వహణకు కొందరు వ్యక్తులు పావులు కదుపుతున్నారని అన్నారు. గ్రామపంచాయతీకి ఆదాయం చేకూరే విధంగా ఓపెన్ టెండర్ వేలం వేసే విధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశంలో తీర్మానించాలని పంచాయతీ సెక్రెటరీ నాగరాజు కు వినతి పత్రం అందజేశారు.
