దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ అవార్డులకు కేంద్రం దరఖాస్తులను ఆహ్వానించింది. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించే అవార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది.
వివిధ రంగాలలో సేవలందించిన ప్రముఖ వ్యక్తులు జూలై 31వ తేదీలోపు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.inలో సిఫార్సులు లేదా పేర్లను అప్లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.