ఈ క్యాష్ .. కలెక్టర్ దే..
ఈ క్యాష్ .. కలెక్టర్ దే..
బీహారీ వ్యాపారి అఫిషీయల్ కార్డ్
ఇదొక కట్టుకథ.. పోలీసులు ఆశ్చర్యం

( గోరఖ్ పూర్ , ఆంధ్రప్రభ ప్రతినిధి)
బీహార్ బ్యాలెట్ వార్ లో.. ఎన్నో చిత్ర విచిత్ర ట్విస్టులు తెరమీదకు రాగానే .. భారతవని ఆశ్చర్యపోతుంది. ఔరా ఇది నిజమా అని జనం అవాక్కవుతారు. నోరు వెళ్లబెడతారు. తాజాగా బీహార్ గోరఖ్ పూర్ ( Bihar Gorakh Pur) లో .. సాదాసీదా బుక్ స్టాల్ నిర్వాహకుడి బ్యాగులో కోటిరూపాయాల (Rs.1.00 Crore cash) నగదు .. ప్రత్యక్షం కాగా.. ఈ లెక్క పత్రం లేని డబ్బు ఎవరిదో అనే అంశం ఓ మిస్టరీగా (Mystory) మారింది.
గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం (07.11.2025) భారీ బ్యాగుతో మోకామాకు చెందిన ముకుంద్ మాధవ్ (32 ఏళ్ల యువకుడు) ఫ్లాట్ పారమ్ పై .. పోలీసుల్నే గమనిస్తున్నాడు. సీసీ కెమెరాలో ఈ పరిస్థితిని గమనించి… సమ్ థింగ్ రాంగ్ .. అని జీఆర్పీ సిబ్బంది రంగంలోకి దిగారు. ముందు టిక్కెట్ అడిగారు. ఆ యువకుడు ఫస్ట్ క్లాస్ టిక్కెట్ చూపించాడు. బ్యాగ్ ను తనిఖీ చేయాలని కోరారు. ఆ అతడు ఒప్పుకోలేదు. ఇది ఓ కలెక్టర్ బ్యాగ్ అని .. అఫీషియల్ కార్డు విసిరాడు. పోలీసు అధికారి వినోద్ కుమార్ (GRP CI ) ఆ బ్యాగును చ ఓపెన్ చేశారు. అందులో రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి. ఈ డబ్బు ఎవరిది? ఏ బ్యాంకులో విత్ డ్రా చేశావు? లేదా ఈ డబ్బు ఎవరు ఇచ్చారు? అని సీఐ ప్రశ్నించారు.
మోకామాలో చిన్న బుక్ స్టాల్ నడుపుతున్నానని, చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తానని ముకుంద్ సమాధానం ఇచ్చాడు. ఈ డబ్బు ఓ ఐఏఎస్ ఆఫీసర్ తనకు ఇచ్చి తన దగ్గర ఉంచాలని కోరాడని మాధవ్ చెప్పాడు. పోలీసులు ఉరమి చూసే సరికి.. మరో కథ చెప్పాడు. ఈ డబ్బు అతడిదే నట. స్నేహితుడికి అప్పుగా ఇచ్చాడు. అప్పు తిరిగి చెల్లిస్తూ గోరఖ్ పూర్ లో ఓ వ్యక్తి దగ్గర తీసుకోవాలని స్నేహితుడు సమాచారం ఇచ్చాడు. గోరఖ్పూర్ బార్గద్వా ప్రాంతానికి మాధవ్ చేరుకున్నాడు. ఓ గుర్తుతెలియని కుర్రోడు బైక్ ఇచ్చి ఈ బ్యాగ్ ఇచ్చాడు. అని మాధవ్ చెప్పాడు. బ్యాగ్ లో ఎంత డబ్బు ఉందని అడిగితే.. సమాధానం రాలేదు. ఇక నోట్ల కట్టలను లెక్కపెడితే మొత్తం నగదు రూ.99.09లక్షలుగా పోలీపులు గుర్తించారు. ఇది లెక్కపత్రం లేని ఎలక్షన్ డబ్బుగా భావించి.. ఈ డబ్బు ఆసాములెవ్వరో తేల్చే పనిని ఐటీశాఖకు పోలీసు శాఖ అప్పగించింది. బీహార్ లో ఎన్నికల సందర్భంగా.. గత జూలై నుంచి బల్లియా, వారణాసి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్చ గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లలో తొమ్మిది తనిఖీల్లో రూ.5.29 కోట్లకు పైగా బ్యాక్ మనీని జీఆర్పీ స్వాధీనం చేసుకుంది.
