INDvsAFG | టీమిండియాను కలవర పెడుతున్న పెద్ద సమస్య ఇదే..
INDvsAFG | టీమిండియాను కలవర పెడుతున్న పెద్ద సమస్య ఇదే..
- 15.23 సగటుతో ఫెయిలైన బ్యాటింగ్.. ఇప్పుడు ఎలా?
- రాహుల్కు వైస్ కెప్టెన్సీ.. పంత్కు కాస్త రిలీఫ్
- ఆఫ్ఘాన్ టెస్టులో కొత్త స్పిన్నర్ అరంగేట్రం ?
న్యూచండీగఢ్ వేదికగా ప్రారంభం కానున్న భారత్-ఆఫ్ఘనిస్థాన్(INDvsAFG ) ఏకైక టెస్టుపై ఆసక్తి నెలకొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత జట్టు కంటే ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది బ్యాటింగ్ విభాగం. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ సగటు కేవలం 15.23 మాత్రమే ఉండటం పరిస్థితిని అద్దం పడుతోంది. అంతేకాదు, మొత్తం సిరీస్లో యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా మాత్రమే అర్ధశతకాలు నమోదు చేయగలిగారు.
ఈ నేపథ్యంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ మరోసారి నంబర్-3 స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. “సాయికి ఇంకా సరైన అవకాశం రాలేదు. అతడికి సమయం ఇవ్వాలి” అని కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే స్పష్టం చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో సాయి ప్రదర్శనపై అందరి దృష్టి నిలిచింది.
మరోవైపు కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా నియమించడం కూడా చర్చకు దారితీసింది. రిషభ్ పంత్పై ఒత్తిడి తగ్గించి, అతడికి మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టులో మరో ఆసక్తికర అంశం స్పిన్ విభాగం. యువ స్పిన్నర్లు హర్ష్ దూబే లేదా మానవ్ సుతార్లో ఒకరు టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వికెట్కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉండగా, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బెంచ్కే పరిమితం కావచ్చని సమాచారం.
శ్రీలంక, న్యూజిలాండ్ వంటి కఠిన పర్యటనలకు ముందు ఈ టెస్టు భారత్కు కీలక పరీక్షగా మారింది. మరోవైపు భారత గడ్డపై చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ కూడా పూర్తి ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
