ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : టెలికమ్యూనికేషన్ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ ద్వారా కీలక అంశాలు వెల్లడించారు. భవిష్యత్తులో సురక్షిత కమ్యూనికేషన్, డిజిటల్ మౌలిక సదుపాయాలు అత్యంత ముఖ్యమని అన్నారు. అమరావతిలో క్వాంటం టెస్ట్ బెడ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కేంద్రం క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలకు సహాయపడనుంది. విద్యార్థులు, స్టార్టప్లు వీటికి ప్రేరణగా అవకాశాలు పొందుతారని పేర్కొన్నారు. అమరావతిని డీప్ టెక్ హబ్గా అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు.
