ములకలపల్లి, మార్చి 8 (ఆంధ్రప్రభ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మండల అధ్యక్ష కార్యదర్శులు చిక్కుల శ్రీను, గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీవో రేవతికి మెమోరాండం అందజేశారు. గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల పారిశుద్ధ్య పనులు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు అందిస్తున్నారని గ్రామపంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగుల వలె గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల బకాయిల వేతనాల పెండింగ్ బిల్లుల్లో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్ టి ఓలలో నిలిచిపోయిన కార్మికుల వేతనాలను కార్మికుల అకౌంట్స్ లో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు, వర్క రుక్మధరావు, జేఏసీ నాయకులు గద్దల మహేష్, బైటి అశోక్, మేకల రమేష్, కొక్కర గడ్డ సతీష్, పోక్కిలి నరేష్, సాయిరత్న, వగ్గేల దారయ్య, చనగాని శంకర్, వెలకం రాఘవయ్య, దుబ్బ భాస్కర్, బత్తుల సంజీవరావు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.