AP/TG | మ‌రో ఎన్నిక‌ల‌కు న‌గ‌రా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల


తెలంగాణ‌, ఎపిలోని మొత్తం 10 స్థానాల‌కు ఎల‌క్ష‌న్
మార్చి 3వ తేది నుంచి నామినేష‌న్ లు స్వీక‌ర‌ణ
మార్చి 20 వ తేదిన పోలింగ్ ,అదే రోజు కౌంటింగ్

న్యూ ఢిల్లీ – ఇప్ప‌టికే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానాల‌కు ఈ నెల 27న పోలింగ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో మరో ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు పోరు జ‌ర‌గ‌నుంది. తెలంగాణ‌, అంధ్ర‌ప్ర‌దేశ్ ల‌లో మొత్తం 10 స్థానాల‌కు జ‌ర‌గనున్న ఎన్నిక‌ల‌కు నేడు ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ విడుదల చేసింది. మార్చి 29లోగా ఏపీలోని ఐదుగురు, తెలంగాణకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ నేప‌థ్యంలోనే ఈ ఎన్నిక‌ల‌కు నోటిపికేష‌న్ విడుద‌ల చేసింది. మార్చి మూడో తేది నుంచి నామినేష‌న్ లు స్వీక‌రిస్తారు.. 10 వ తేది నామినేష‌న్ స్వీక‌ర‌ణ‌కు ఆఖ‌రు తేది. మార్చి 20వ తేదిన పోలింగ్ జ‌ర‌గ‌నుంది.. ఇక ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు సాయంత్రం నిర్వ‌హిస్తారు.

ఇది ఇలాఉంటే ఎపి నుంచి కృష్ణ మూర్తి జంగా , దువారపు రామారావు, పర్చూరి అశోక్ బాబు, బి. తిరుమల నాయుడు
, రామకృష్ణుడు యనమల, తెలంగాణ‌కు చెందిన మ‌హ్మ‌మూద్ అలీ, స‌త్య‌వ‌తి రాథోడ్, సెరి సుభాష్ రెడ్డిర మల్లేశం యెగ్గే
మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండిలు ప‌ద‌వీ కాలం ముగియ‌నుండ‌టంతో ఈ ఎన్నిక‌లు జ‌రుపుతున్నారు.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వివ‌రాలు …

  1. నోటిఫికేషన్ జారీ 03,, మార్చి, 2025 (సోమవారం)
  2. నామినేషన్లు వేయడానికి చివరి తేదీ 10, మార్చి, 2025 [సోమవారం)
  3. నామినేషన్ల పరిశీలన 1lన మార్చి, 2025
  4. అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 13 మార్చి, 2025
  5. పోలింగ్ తేదీ 20న మార్చి, పోలింగ్ వేళలు ఉద‌యం 09:00 నుంచి సాయంత్రం 04:00వ‌ర‌కు
  6. ఓట్ల లెక్కింపు 20వ తేదీ మార్చి,

Leave a Reply