బస్సులో మంటలు..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్‌ నుంచి తరలిపోతున్న వలసదారుల బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ హెరాత్‌ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఇరాన్‌ (Iran) నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన అఫ్గాన్‌ వలసదారులతో వెళ్తున్న బస్సు, మోటారు సైకిల్‌ ఢీకొన్నాయి. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 17 మంది చిన్నారులతో సహా 71 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నాం. మోటారుబైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు. నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుంది. కాగా.. అఫ్గాన్‌ శరణార్థులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్‌, పాకిస్థాన్‌ (Pakistan) భారీ డిపోర్టేషన్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 1.5 మిలియన్ల మందికి పైగా అఫ్గాన్లు ఇరాన్‌, పాకిస్థాన్‌ నుంచి బలవంతంగా స్వదేశానికి తిరిగివచ్చారు.

Leave a Reply