AP | ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 15మందికి గాయాలు

కసింకోట, జూన్23 (ఆంధ్రప్రభ ) : అనకాపల్లి (Anakapalli) జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు (RTC bus), లారీ (Lorry) ఢీకొన్నాయి. ఈ సంఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. నర్సీపట్నం డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ ఆర్టీసీ బస్సు విశాఖపట్నం (Visakhapatnam) వెళుతూ దారిలో బయ్యవరం వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 34మంది ప్రయాణికులున్నారు.

లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు చెల్లాచెదురుగా పడ్డారు. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ (Bus driver) తో పాటు సుమారు 15మందికి గాయాలయ్యాయి. వీరిలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, మిగిలిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఆస్ప‌త్రికి తరలించారు. బస్సు రోడ్డు మధ్యలో ఉండిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి డి.ఎస్.పి శ్రావణి, కసింకోట సీఐ అల్లు స్వామి నాయుడు పరిశీలించారు.

Leave a Reply