AP| మరో సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్

వెలగపూడి | భారత రక్షణ దళాల్లో సేవలందిస్తున్న సైనికుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సహా భారత రక్షణ దళాలకు సేవలందిస్తున్న సైనికులకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

సైనికుల పట్ల కృతజ్ఞత సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న ఈ ముఖ్య నిర్ణయం తీసుకున్నట్టు పవన్ అనౌన్స్ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని రక్షణ దళాలకు చెందిన సిబ్బందికి ఆస్తి పన్ను మాఫీ కల్పించనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రయోజనం రిటైర్డ్ సైనికులకు లేదా సరిహద్దుల్లో సేవలు నిర్వహిస్తున్న వారికి మాత్రమే వర్తించేది.

అయితే ఇప్పుడు దీనిని మరింత విస్తరించుతూ, దేశ రక్షణలో ఉన్న అన్ని విభాగాల ప్రస్తుత ఉద్యోగులకూ ఈ మాఫీ వర్తింపజేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఆస్తి పన్ను మినహాయింపు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, పారామిలిటరీ దళాలు, సీఆర్పీఎఫ్‌ వంటి విభాగాలకు వర్తించనుంది.

ఇకపై ఈ సౌకర్యం ప్రస్తుతం విధుల్లో ఉన్న సైనికులకు అందుబాటులో ఉండనుంది. వారు ఉన్నత స్థాయిలో ఎక్కడైనా పని చేస్తున్నా సరే, వారికి లేదా వారి భార్యకు కలిపి ఒక్క ఇంటికి ఈ మాఫీ వర్తించనుంది. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు

.ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ లోని కూటమి ప్రభుత్వం.. దేశాన్ని రక్షిస్తున్న సిబ్బంది కోసం గౌరవతలంపుగా నిలుస్తుందన్నారు పవన్. వారి నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఈ మాఫీని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత రక్షణ దళాల సేవలు అమూల్యమైనవని కొనియాడుతూ.. వారిని గౌరవించడం మన కర్తవ్యమని ట్వీట్ లో రాసుకొచ్చారు. జై హింద్.. భారత్ మాతా కీ జై అంటూ పోస్ట్ చేశారు.

Leave a Reply