టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత.. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. తాజాగా నేడు (భుదవారం) సుదీర్ఘ ఫార్మాట్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. వన్డే క్రికెట్లో కొనసాగుతానని తెలిపాడు.
ఈ మేరకు రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. రోహిత్ శర్మ ఆకస్మిక నిర్ణయం టీమిండియా అభిమానులను షాక్ కు గురిచేసింది.
రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్లో 2013లో వెస్టిండీస్తో కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్తో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. మొత్తం 67 మ్యాచ్ల్లో 116 ఇన్నింగ్స్లు ఆడి 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలతో పాటు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 212 పరుగులు.
విరాట్ కోహ్లీ అనంతరం 2022లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. 24 టెస్ట్ మ్యాచ్లలో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. వీటిలో 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు ఉన్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, భారత జ్టటు డబ్ల్యూటీసీ 2023 ఫైనల్కు చేరుకుంది. కానీ వారు టైటిల్ గెలవలేకపోయారు.
