ఇంగ్లాండ్ తో వ‌న్డే సిరీస్… నితీష్ కుమార్ రెడ్డి అవుట్ !!

  • జట్టులోకి శివమ్ దూబే!
  • కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

ఆంధ్ర‌ప్ర‌భ‌, హైదరాబాద్ : ఇంగ్లాండ్‌తో త్వరలో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సవరించిన భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. గాయం కారణంగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు దూరమైన యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో.. స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను సెలక్టర్లు జట్టులోకి ఎంపిక చేశారు.

గిల్‌కు సారథ్య బాధ్యతలు.. శ్రేయస్ వైస్ కెప్టెన్

ఈ వన్డే సిరీస్‌కు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, న‌యా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ (ఉప కెప్టెన్) గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా, దేశీవాళీ క్రికెట్‌లో రాణించిన యువ ఆటగాడు గుర్నూర్ బ్రార్ కూడా ఈ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు.

జూలై 14 నుండి వన్డే సమరం

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14 నుంచి ప్రారంభం కానుంది. చాంపియన్స్ ట్రోఫీ రోడ్ మ్యాప్‌లో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి దూరం కావడం నిరుత్సాహపరిచినప్పటికీ, ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌లో ఫినిషర్‌గా రాణిస్తున్న శివమ్ దూబే రాకతో జట్టు మిడిలార్డర్ మరింత బలోపేతమైందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

1వ వన్డే: జూలై 14 (ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్)
2వ వన్డే: జూలై 16 (సోఫియా గార్డెన్స్, కార్డిఫ్)
3వ వన్డే: జూలై 19 (లార్డ్స్, లండన్)

భారత తుది జట్టు..

శుభ్‎మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కె. ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‎దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, శివమ్ దూబే