సాహస యాత్రికుడికి ఢిల్లీ ఎల్‌జీ అభినందనలు

సాహస యాత్రికుడికి ఢిల్లీ ఎల్‌జీ అభినందనలు

– మరిపెడ యువకుడి ఘనత

మరిపెడ,ఆంధ్రప్రభ: ప్రముఖ పర్వతారోహకుడు మరిపెడ మండలానికి చెందిన భూక్య యశ్వంత్ నాయక్ న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఢిల్లీ గౌరవనీయ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యశ్వంత్ నాయక్ తన స్ఫూర్తిదాయకమైన పర్వతారోహణ ప్రయాణం, ఇప్పటివరకు సాధించిన విజయాలు, అలాగే తన ప్రతిష్ఠాత్మకమైన “హర్ శిఖర్ పర్ తిరంగా” మిషన్ కింద చేపట్టనున్న భవిష్యత్ యాత్రల వివరాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు వివరించారు.

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన , సవాళ్లతో కూడిన పర్వత శిఖరాలపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. యశ్వంత్ నాయక్ సాధించిన విశేష విజయాలను అభినందించిన లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు, ఆయనకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు తెలిపారు.

సాహసం, పర్వతారోహణ రంగాల ద్వారా దేశానికి గుర్తింపు తీసుకురావడంలో యశ్వంత్ నాయక్ చూపుతున్న అంకితభావం, పట్టుదల, దేశభక్తి స్పూర్తిని ఆయన ప్రశంసించారు. ఈ సమావేశం యువతలో సాహస క్రీడలపై ఆసక్తి పెంపొందించడంతో పాటు దేశభక్తి భావనను బలోపేతం చేసేలా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

Leave a Reply