tips| ఆరోగ్య సూత్రాలు..

మార్చిలోనే మంటలు
భగ్గుమంటున్న ఎండలు..
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదు
ఆరోగ్య జాగ్రత్తలు పాటించకుంటే కష్టాలే..
వేసవిలో ఇలా చేద్దాం..
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : మార్చి నెలలోనే భానుడు భగ్గుమంటున్నాడు. నెల ప్రారంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును చేరుకోవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగి మధ్యాహ్నం వేళలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఈ అకాల తీవ్రతతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణలు చెబుతున్నారు.

- ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.
- ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి.
- పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
- రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.
- ఒంటికి వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
- ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్లు వాడాలి.
- కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్ ధరించడం మర్చిపోవద్దు.
- తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి.
- ముఖ్యంగా పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి.
- ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు ముగించాలి.
- పలుచని బట్టలు వేయాలి.
- ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు సన్వూస్కీన్లోషన్లు వాడాలి.
- చిన్న పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి.
- గంటకోసారి గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
- ఫ్రిజ్ నీరు కంటే కుండలో నీరు తాగడం వల్ల గొంతు సమస్యలు రావు.
- కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగి అంబలి వంటివి శరీరంలోని ఎలక్ర్టోలైట్స్ సమతుల్యతను కాపాడతాయి.
- వేసవిలో మసాలాలు, వేపుళ్లు తగ్గించి ఆకు కూరలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వండి.
- పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను డైట్లో చేర్చుకోండి.
- ఇవి డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి.
- వేసవిలో నూనెతో చేసిన చిరుతిండ్లు తినటం, కాఫీ ,టీ ,మత్తు పదార్ధాలను సేవించటం ,ధూమపానం ఇవన్నీ ప్రాణాంతకమైనవే..
తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు ,జావ ,.గంజి ,సలాడ్ లవంటివి ఆరోగ్యానిన అత్యుత్తమమైనవే..
కూల్ డ్రింకులూ ,రెడీమెడీ ఫుడ్లూ , పిజ్జాలం ,బర్గర్లూ తింటే కోరికావాలని మనప్రాణాలను హైరిస్క్ పెట్టినట్లే.. - పుచ్చకాయ జ్యూస్ , సపోటా , కర్భూజా ,చెరకురసం ,నిమ్మకాయ షర్బత్ ,అల్లం ,పుదీనా ,నిమ్మరసం , ఉప్పు కలిపిన చల్లని (తగినంత చల్లని) మజ్జిగ ..సబ్జాగింజల పానీయం ,బార్లీ జావ , తాటిముంజెలు , కొబ్బరినీరు ఇవన్నీ వేసవితాపం నుండి బయటపడవేసే దివ్యమైన ఆహార పానీయాలే.

చర్మ సౌందర్యం కోసం..
- రోజంతా చర్మం పై తేమ ఉండేలా చూసుకోవాలి.
- ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి.
- దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్ను రాసుకుంటే మంచిది.
- చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు.
- దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది.
- వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది.
- కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా కడుక్కోండి.
- ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోండి.
- ఐస్తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది.
- స్క్రబ్బర్లను ఉపయోగించకండి. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది.
- టమాటా, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది.
- అంతేకాదు ముఖంపై ఉన్న బ్లాక్హెడ్స్ కూడా తగ్గిపోతాయి.
- ముఖంపై ర్యాషెస్ లేదా మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు.
- వేసవిలో కేశ సంరక్షణ కూడా చాలా ముఖ్యం.
- జుట్టును మరీ పొడవుగా ఉంచుకోకుండా వీలయినంత తక్కువగా ఉంచుకుంటే మంచిది.
- ఎండకు శిరోజాలు దెబ్బతినకుండా ఉండడానికి కండీషనర్ క్రీమును రాసుకోవడం తప్పనిసరి.
- హెన్నాచాలా చక్కని కండీషనర్గా ఉపయోగపడుతుంది.
- వేసవిలో ఎక్కువగా స్విమ్మింగ్ చేయడం చాలా మందికి అలవాటు.
- అయితే స్విమ్మింగ్ ఎక్కువ సమయం చేయడంవల్ల నీళ్లలో ఉండే క్లోరిన్ కేశ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది.
- కనుక స్విమ్మింగ్ చేసేటప్పుడు తప్పకుండా తలకు మాస్క్ ధరించడం మరచిపోవద్దు.
