Breaking |హోటల్ లో పేలుడు..

Breaking |హోటల్ లో పేలుడు..
ముగ్గురికి తీవ్రగాయాలు
Breaking |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో పేలుడు ఘటన చోటుచేసుకుంది. చట్నీస్ హోటల్ లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ఘటన జరగడంతో అందులో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు శబ్దానికి వినియోగదారులు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
